...

0 views

way to heaven
*స్వర్గానికి_రోడ్డు_మార్గం*
______________________
భూమి నుండి స్వర్గానికి చేరుకోడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం, బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరంలో వుండే చిన్న గ్రామం, ఈ గ్రామం చివర నుండి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహి స్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి!

ఈ సరస్వతినది పక్కన -  *భీమపుల్* అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు. ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లుగా పెద్దపెద్ద అచ్చులున్నాయి  వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం.  ‘మన’ నుండి ‘చట్మోలి’ 8km ప్రారంభం అవుతుంది.

మార్గమధ్యలో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది. తరువాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్న తల్లిగాచెప్తారు. ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.   తర్వాత కుబేర్మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసు రుడు బలవంతంగా తీసుకున్నాడంటారు.  ఇక్కడి నుండి 5km ప్రయాణం చేసాక వసుధార జలపాతం వస్తుంది. ఇక్కడే అష్ట వసువులు  దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది. ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాలా పలుచగా నీటి తుంపరలవలె పడుతుంది.అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

తర్వాత (12,000 అ.ఎత్తులో ) చట్మోలి అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతo. ఇక్కడే "సతోపంత్" మరియు భగీరధథ్ కర్క్ అనే రెండు నదులు (హిమానీ నదాలు) కలిసి "అలకనంద" గా ఏర్పడతాయి. చట్మోలి నుండి 1km తర్వాత లక్ష్మివన్ ప్రాంతం -  ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఏంతో ఆహ్లాదంగా ఉంటుంది.  ఇక్కడే లక్ష్మీవిష్ణువులు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.  ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని  చెప్తారు.  

ఇక్కడి నుండి 2km ప్రయాణించాక  బంధర్ అనే ప్రాంతం, ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.  బంధర్ నుండి సహస్రధార, చక్ర తీర్ధం 5km (15,000 అడుగుల ఎత్తులో). చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సుగా చెప్తారు. ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.  చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km:.

సతోపంత్ అనేది త్రిభుజాకృతి లో వుండే సరస్సు.ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందర మైన స్వచ్చ మైన నీరు ఉండే  సరస్సు. ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపంలో వారిని సేవిస్తారని చెప్తారు. ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహాన్ని చూడవచ్చు. ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు. 

సతోపంత్  నుండి స్వర్గా రోహిణం 8 km:- ఈ మార్గం బహుకష్టంగాను ప్రయాణానికి దుస్సాహసం గాను చెప్తారు.మార్గం లో ద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయి.  ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే ఒక కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు.

నిజానికి "స్వర్గారోహిణి" అనేది  *6 పర్వతాల సమూహం* గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో  ఉత్తరకాశి జిల్లాలోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి  చెందినది. దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.  ఈ స్వర్గా రోహిణి పర్వతాగ్రం (20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది  3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే  మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి  పైకి వెళితే స్వర్గముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

© director.gopikiran